న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8: కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీకి కూడా చిప్ కొరతతో సతమతమవుతున్నది. దీంతో గత నెలలో ఉత్పత్తి ఏడాది ప్రాతిపదికన 8శాతం తగ్గి 1,13,937 యూనిట్లను మాత్రమే ప్రొడక్షన్ చేసింది. సెమికండక్టర్ల కొరతతో కొన్ని యూనిట్లు మూతపడినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గతేడాది ఇదే నెలలో సంస్థ 1,23,769 యూనిట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. ఎలక్రానిక్ విడిభాగాల కొరతతో గత నెలలో ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపిందని కంపెనీ విడుదల చేసిన నోట్లో పేర్కొంది. ఇటీవల కాలంలో ఆటోమొబైల్ రంగానికి చెందిన అత్యధిక సంస్థలు సెమికండక్టర్ల వాడకాన్ని భారీగా పెంచాయి..ముఖ్యంగా ఎలక్ట్రానిక్ ఫీచర్స్లో బ్లూటూత్ కనెక్టివిటీ, డ్రైవర్-అసిస్ట్, నావిగేషన్, హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సిస్టమ్ కోసం వీటిని వాడుతున్నారు.