న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ నిరుత్సాహక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను సంస్థ రూ.3,659 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,911 కోట్ల లాభంతో పోలిస్తే 6.45 శాతం తగ్గింది. గత త్రైమాసికంలో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు జరిపినప్పటికీ మార్కెట్ టూ మార్కెట్ ప్రభావంతో లాభాల్లో కోత పడిందని పేర్కొంది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 28.2 శాతం ఎగబాకి రూ.40,920 కోట్ల నుంచి రూ.52,462.5 కోట్లకు ఎగబాకినట్టు వెల్లడించింది.
మరోవైపు, గత త్రైమాసికంలో సంస్థ మరో చరిత్రను సృష్టించింది. కంపెనీ చరిత్రలో తొలిసారిగా ఒక త్రైమాసికంలో రూ.50 వేల కోట్ల విలువైన విక్రయాలు జరుపడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగా సమావేశమైన కంపెనీ బోర్డు గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ప్రతిషేరుకూ రూ.140 డివిడెండ్ను ప్రకటించింది. కిందటేడాది ప్రకటించిన రూ.135 కంటే ఇది అధికం.