న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ వాహన ధరలను పెంచింది. శనివారం నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల వాహన ధరలను 0.8 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఉత్పత్తి వ్యయం అధికమవడం, రెగ్యులేటరీ నియమ నిబంధనలు అమలు చేయడానికి సంస్థపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలు పెంచనున్నట్లు గత నెల చివర్లో ప్రకటించిన విషయం తెలిసిందే.