Maruti Suzuki : మారుతి సుజుకి తన స్విఫ్ట్ మోడల్, గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్ ధరలను పెంచిన అనంతరం కంపెనీ షేర్లు రెండు శాతం పడిపోయాయి. స్విఫ్ట్, గ్రాండ్ విటారా ఎంపిక చేసిన వేరియంట్ల ధరల పెంపు నేటి నుంచి అమల్లోకి వస్తుందని మారుతి సుజుకి స్టాక్ ఎక్స్ఛేంజ్కు తెలిపింది.
స్విఫ్ట్ ధరను రూ. 25,000, గ్రాండ్ విటారా సిగ్మా వేరియంట్ ధర రూ. 19,000 చొప్పున పెరిగిందని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ధరల పెంపును ప్రకటించిన అనంతరం మారుతి సుజుకి షేర్ ధర పతనమైంది.
భారత్లో అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతి సుజుకి షేర్ ధర రానున్న రోజుల్లో పెరుగుతందని గ్లోబల్ బ్రోకింగ్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. కంపెనీ షేర్ టార్గెట్ ధర రూ. 14,322గా పేర్కొంది. మారుతి సుజుకి షేర్ ధర గత ఏడాదిగా 48 శాతానికి పైగా పెరగ్గా, ఈ ఏడాదిలో ఏకంగా 23 శాతం పెరిగింది.
Read More :
Congress | మజ్లిస్, కాంగ్రెస్ మధ్య అవగాహన! రాష్ట్రవ్యాప్తంగా పరస్పర సహకారం