న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశీయ ఆటో రంగ దిగ్గజం మారుతి సుజుకీ కార్ల ఉత్పత్తిని చిప్ల కొరత వేధిస్తున్నది. సాధారణ ఉత్పత్తిలో సగానికిపైగా ఈ సెప్టెంబర్లో పడిపోవచ్చని మంగళవారం తెలిపింది. హర్యానా, గుజరాత్ల్లోని ప్లాంట్లలో సెమీకండక్టర్ కొరత కారణంగా మొత్తం ఉత్పత్తి కేవలం 40 శాతానికి పరిమితం కావచ్చన్నది. గుర్గావ్, మనేసర్ తదితర ప్లాంట్ల వార్షిక ఉత్పాదక సామర్థ్యం 22.5 లక్షల యూనిట్లుగా ఉన్నది. ఇదిలావుంటే వాహన ధరలు పెంచకపోతే నష్టాలేనని, పెరుగుతున్న ఉత్పాదక వ్యయానికి అనుగుణంగా కార్ల ధరలు పెంచితేనే సంస్థకు లాభాలని ఈ సందర్భంగా మారుతి వ్యాఖ్యానించింది.