న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ కీలక నిర్ణయం తీసుకున్నది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో హర్యానాలో ఉన్న రెండు ప్లాంట్లను వచ్చే నెల 1 నుంచి 9 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తద్వారా తమ వద్ద ఉన్న ఆక్సిజన్ నిల్వలను అత్యవసర అవసరాలకు వినియోగించుకునేందుకు వీలు పడనున్నదని ఒక ప్రకటనలలో వెల్లడించింది. తొమ్మిది రోజుల పాటు షట్డౌన్ విధించనుండటంతో ఈ రెండు యూనిట్లలో ఆక్సిజన్ వాడకం ఉండదని, దీంతో దేశవ్యాప్తంగా కొంతమేర కొరత నివారించినట్లు అవుతున్నదని పేర్కొంది.