న్యూఢిల్లీ, డిసెంబర్ 22: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ..నూతనంగా కార్లను కొనుగోలు చేసేవారికి షాకిచ్చింది. వచ్చే నెల నుంచి అమలులోకి వచ్చేలా అన్ని రకాల కార్ల ధరలను రూ.1,500 నుంచి రూ.8,014 లోపు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది.
వీటిలో ఆల్టో, వ్యాగన్ ఆర్ మోడళ్లు రూ.1,500 వరకు అధికమవనుండగా..బాలెనో రూ.8,014 వరకు ప్రియంకానున్నది. ఇటీవల మార్కెట్లోకి నూతనంగా విడుదల చేసిన ఇగ్నిస్ను ఈ ధరల పెంపు నుంచి మినహాయింపునిచ్చింది.