ముంబై, నవంబర్ 24: దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులతో హోరెత్తించాయి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 762.1 పాయింట్లు లేదా 1.24 శాతం ఎగబాకి మునుపెన్నడూ లేనివిధంగా 62,272.68 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 901.75 పాయింట్లు ఎగిసి 62,412.33 స్థాయిని తాకడం గమనార్హం. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 216.85 పాయింట్లు లేదా 1.19 శాతం పుంజుకొని 18,484.1 వద్ద నిలిచింది. ఒక దశలో 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేస్తూ 18,529.7 వద్దకు చేరింది. దీంతో వరుసగా మూడు రోజుల్లో సెన్సెక్స్ 1,167 పాయింట్లు, నిఫ్టీ 324 పాయింట్లు పెరిగినైట్టెంది. ఇకపోతే హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, రిలయన్స్ తదితర షేర్లు మదుపరులను అమితంగా ఆకట్టుకున్నాయి.
లాభాలకు కారణాలివే..