Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.67,259 కోట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్లలో సాధారణ బుల్లిష్ ధోరణితో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధానంగా లబ్ధి పొందింది. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 819.41 పాయింట్ల లబ్ధితో ముగిసింది. హోలీ సందర్భంగా సోమవారం, గుడ్ ఫ్రైడే సందర్భంగా మార్చి 29న స్టాక్ మార్కెట్లకు సెలవు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.45,262.59 కోట్లు పెరిగి రూ.20,14,010.63 కోట్లకు చేరుకున్నది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.5,533.26 కోట్లు పుంజుకుని రూ.6,71,666.29 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5,218.12 కోట్లు పెరిగి రూ.5,78,484.29 కోట్ల వద్ద ముగిసింది. ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేసన్ రూ.4,132.67 కోట్ల లబ్ధితో రూ.7,69,542.65 కోట్ల వద్ద నిలిచింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,029.69 కోట్ల లాభంతో రూ.11,00,184.60 కోట్ల వద్ద స్థిర పడింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.2,819.51 కోట్లు పెరిగి రూ.5,32,946.04 కోట్ల వద్ద ముగిసింది. ఐటీసీ ఎం-క్యాప్ స్వల్పంగా రూ.264.15 కోట్లు పుంజుకుని రూ.5,35,032.74 కోట్ల వద్ద నిలిచింది.
మరోవైపు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,691.45 కోట్లు నష్టపోయి రూ.14,05,102.38 కోట్ల వద్ద స్థిర పడింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.4,163.13 కోట్లు పతనమై రూ.6,22,117.38 కోట్లకు చేరుకున్నది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.3,817.18 కోట్ల నష్టంతో రూ.6,95,038.48 కోట్ల వద్ద నిలిచింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో అత్యంత విలువైన సంస్థగా రిలయన్స్ మొదటి స్థానంలో కొనసాగుతున్నది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), ఇన్ఫోసిస్, ఐటీసీ, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) నిలిచాయి.