Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థలు రూ.1.16 లక్షల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయాయి. అయోధ్యలో రామ్ లల్లా ప్రారంభోత్సవం, రిపబ్లిక్ డే సందర్భంగా సెలవుల నేపథ్యంలో కేవలం మూడు రోజుల్లోనే అత్యధికంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 982.6 పాయింట్లు (1.37 శాతం) నష్టపోయింది.
టాప్-10 సంస్థల్లో రిలయన్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ నష్టపోయాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పుంజుకున్నది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.32,661.45 కోట్ల నష్టంతో రూ.10,90,001.31 కోట్లకు పడిపోయింది. ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.20,682.74 కోట్ల పతనంతో రూ.5,71,337.04 కోట్ల వద్ద స్థిర పడింది. టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.19,173.43 కోట్ల నష్టంతో రూ.13,93,439.94 కోట్లతో సరి పెట్టుకున్నది. ఎస్బీఐ ఎం-క్యాప్ రూ.16,559.77 కోట్లు కోల్పోయి రూ.5,46,989.47 కోట్ల వద్ద ముగిసింది.
ఐటీసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15,908.1 కోట్లు కోల్పోయి రూ.5,68,262.28 కోట్ల వద్ద స్థిర పడింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.9,210.4 కోట్ల నష్టంతో రూ.5,70,974.17 కోట్ల వద్ద నిలిచింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.1,928.22 కోట్ల నష్టంతో రూ.18,33,737.60 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.20,727.87 కోట్లు పెరిగి రూ.6,52,457.83 కోట్ల వద్ద ముగిసింది. ఇన్ఫోసిస్ ఎం-క్యాప్ రూ.9,151.75 కోట్లు పుంజుకుని రూ.6,93,457.65 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.1,137.37 కోట్ల లబ్ధితో రూ.7,08,511.16 కోట్ల వద్ద ముగిసింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, ఎల్ఐసీ, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ నిలిచాయి.