హైదరాబాద్, అక్టోబర్ 12: మంగళూరు నుంచి హైదరాబాద్ మధ్య మూడో డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసును ప్రారంభించబోతున్నది ఇండిగో. ఈనెల 19 నుంచి అందుబాటులోకి రానున్న ఈ నూతన సర్వీసుతో ఇరు నగరాల మధ్య నడవనున్న సర్వీసుల సంఖ్య మూడుకి చేరుకోనున్నది. ప్రతిరోజు మంగళూరుకు మధ్యాహ్నం 2.15 గంటలకు చేరుకోనున్న విమాన సర్వీసు తిరిగి 2.35 గంటలకు హైదరాబాద్కు బయలుదేరనున్నది. తమిళనాడులోని సేలం నుంచి చెన్నై, హైదరాబాద్, బెంగళూరుకు విమాన సర్వీసులు ఇటీవల ప్రారంభించినది తెలిసిందే.