ముంబై : సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచూ పలు స్ఫూర్తిదాయక, వినోదాత్మక పోస్ట్లు, ఫొటోలు, వీడియోలను షేర్ చేసే కార్పొరేట్ దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) మరో ఆసక్తికర పోస్ట్తో ముందుకొచ్చారు. లేటెస్ట్గా ఓ ఎక్స్ యూజర్ ఆనంద్ మహీంద్ర దృష్టిని ఆకర్షించారు. పారిశ్రామిక దిగ్గజం షేర్ చేసిన ఓ పోస్ట్లో యూజర్ కామెంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
కామెంట్లో సదరు వ్యక్తి సార్..మహీంద్ర గ్రూప్ షేర్స్ కొనుగోలు చేసేందుకు నాకు రూ. లక్ష అవసరం అని రాసుకొచ్చాడు. ఈ కామెంట్పై ఆనంద్ మహీంద్ర సరదాగా రియాక్టరయ్యారు. మీ ధైర్యానికి అభినందనలు..అలా అడగటంలో తప్పేముంది..? అంటూ స్పందించారు. వీరి సంభాషణ సోషల్ మీడియాలో వైరలవగా, మహీంద్రా సరదాగా తీసుకున్న తీరును పలువురు ప్రశంసించారు.
ఆతిధ్య రంగ వ్యాపారి రోహిత్ ఖట్టర్ ఇటీవల గోవాలో న్యూ రెస్టారెంట్ తెరవగా, దాన్ని ప్రశంసిస్తూ మహీంద్రా షేర్ చేసిన పోస్ట్లో ఓ యూజర్ చేసిన ఊహించని ఈ కామెంట్ నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
Read More :
Coronavirus | డేంజర్ బెల్స్.. 109కి పెరిగిన జేఎన్.1 వేరియంట్ కేసులు