Coronavirus | మూడేళ్ల కిందట ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ మరోసారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. మొన్నటి వరకు తగ్గుముఖం పట్టిన మహమ్మారి ఒక్కసారిగా విజృంభిస్తోంది. భారత్తో పాటు ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు అమాంత పెరిగాయి. ఒకవైపు కొవిడ్ కేసులు పెరుగుతుంటే.. మరోవైపు కొత్త వేరియంట్ బయటపడి మరింత కలవరపెడుతోంది. ఇటీవలే కొవిడ్ సబ్ వేరియంట్ ( Covid sub variant) జేఎన్.1 (JN.1) గుర్తించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ దేశంలో చాపకింద నీరులా పాకుతోంది.
తాజాగా గత 24 గంటల వ్యవధిలో 40 జేఎన్.1 వేరియంట్ కేసులు బయటపడ్డాయి. దీంతో డిసెంబర్ 26వ తేదీ వరకుఈ కొత్త వేరియంట్ కేసులు దేశవ్యాప్తంగా మొత్తం 109కి పెరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అందులో అత్యధికంగా గుజరాత్లో 36 కేసులు బయటపడ్డాయి. కర్ణాటకలో 34, గోవాలో 14, మహారాష్ట్రలో 9, కేరళలో 6, రాజస్థాన్లో 4, తమిళనాడులో 4, తెలంగాణలో 2 జేఎన్.1 కేసులు బయటపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
A total of 109 JN.1 COVID variant cases have been reported in the country till 26th December. 36 cases from Gujarat, 34 from Karnataka, 14 from Goa, 9 from Maharashtra, 6 from Kerala, 4 from Rajasthan, 4 from Tamil Nadu and 2 from Telangana: Sources
— ANI (@ANI) December 27, 2023
Also Read..
Ayodhya Ram Temple | అయోధ్య రామాలయం నిర్మాణానికి యాచకుల భారీ విరాళం
Mamata Banerjee | అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ఠకు టీఎంసీ డుమ్మా..!