బెంగళూరు, ఏప్రిల్ 12: మలబార్ గోల్డ్.. తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరించబోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 100 నూతన స్టోర్లను తెరవనున్నట్లు మలబార్ గ్రూపు చైర్మన్ ఎంజీ అహ్మద్ తెలిపారు. దీంట్లోభాగంగానే న్యూజిలాండ్, ఈజిప్ట్, బంగ్లాదేశ్లో ప్రవేశించడంతోపాటు యూర ప్, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియాల్లో మరిన్ని స్టోర్లను తెరవబోతున్నట్లు ఆయన ప్రకటించారు.
అలాగే జార్ఖండ్, గోవా, అసోం, త్రిపుర, జమ్ము అండ్ కశ్మీర్లో మరిన్ని స్టోర్లను ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పారు. ఇందుకోసం కొత్తగా 7 వేల మంది సిబ్బందిని నియమించుకోనుండటంతో మొత్తం సంఖ్య 21 వేల నుంచి 28 వేలకు చేరుకోనున్నారు. మరోవైపు, సంస్థ గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.51,218 కోట్ల వార్షిక టర్నోవర్ను సాధించింది.