హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కొత్త ఆవిష్కరణల తయారే లక్ష్యంగా టీ వర్క్స్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నది. ఈ నెల 16 నుంచి 17 వరకు రెండు రోజుల పాటు టీ వర్క్స్లో నిర్వహించే మేకర్స్ ఫెయిర్ కార్యక్రమానికి రాష్ట్రం నుంచే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహికులు ఎవరైనా పాల్గొనవచ్చునని టీ వర్క్స్ ప్రతినిధి వీర చిప్పా తెలిపారు. విద్యార్థులు తమ ఆవిష్కరణల వేదికగా మేకర్స్ ఫెయిర్ హైదరాబాద్ కార్యక్రమం నిలువనున్నదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాలకు (https:// makerfaire.tworks.in)లో సంప్రదించాలని ఆయన సూచించారు. ఇండియాలోనే అతి పెద్ద మేకర్స్ ఫెయిర్ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ఆవిష్కర్తలు పాల్గొంటున్నారని తెలిపారు.