న్యూఢిల్లీ, మే 3: వార్షిక మెయింటనెన్స్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ఐదు ప్లాంట్లను ప్రస్తుత నెలలో నాలుగు రోజులపాటు మూసివేస్తున్నట్లు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. దీంతో జహీరాబాద్తోపాటు చకాన్, నాసిక్, కందివాలా, హరిద్వార్లలో ఉత్పత్తి కేంద్రాలు మూతపడనున్నాయి. దేశీయంగా కరోనా సెకండ్వేవ్ మరింత ఉధృతమవుతున్న ప్రస్తుత తరుణంలో సంస్థ ఈ కీలక నిర్ణయం తీసుకున్నది. షెడ్యుల్ ప్రకారం వచ్చే నెలలో నాలుగు రోజులు మూసివేయాల్సి ఉండగా, మహమ్మారి కారణంగా ముందుగానే మూసివేస్తున్నట్లు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది.