Mahindra XUV 700 | ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్యూవీ మోడల్ కారు ఎక్స్యూవీ 700 శనివారం దేశీయ విపణిలో ఆర్బాటంగా అడుగు పెట్టింది. కేవలం ఐదు సెకన్లలో 60 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్లనున్న ఎక్స్యూవీ రెండు సిరీస్ ఆప్షన్లలో లభిస్తుంది. ఎంహాక్ డీజిల్, ఎంస్టాలియన్ పెట్రోల్ ఆప్షన్లలో ఆవిష్కరించారు. సెవెన్ సీటర్ ఫెసిలిటీ కల ఈ కారులో ఎలక్ట్రానిక్ మేజర్ సోనీ మద్దతుతో 3డీ సౌండ్ సిస్టం ఆప్షనల్గా జత చేసుకోవచ్చు. మహీంద్రా అడ్రెనోక్స్ ఇంటెలిజెన్స్ ఫీచర్లతో డిజైన్ చేశారు. దీని ధర రూ.11.99 లక్షల నుంచి మొదలవుతుంది.
స్టీరింగ్ వీల్ వెనుకే డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డాష్బోర్డుపై జెయింట్ గ్లాస్ శ్లాబ్ అమర్చారు. మిగతా సంస్థల కార్లతో పోలిస్తే మహీంద్రా ఎక్స్యూవీ 700 కారు బిగ్గెస్ట్ సన్రూఫ్ కలిగి ఉంటుంది. వాయిస్ కమాండ్తో సన్రూఫ్ ఓపెన్ చేయొచ్చు.
డ్రైవర్ మగతలోకి వెళితే హెచ్చరించేందుకు డ్రైవర్ డ్రౌజీనెస్ వార్నింగ్ ఫీచర్ కూడా ఉంది. మీరు కారు నడుపుతూ నిద్ర వస్తుందని ఫీలైతే బ్రేక్ తీసుకోమని సలహా ఇస్తుంది ఇది హ్యుండాయ్ అల్కాజర్, టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్ మోడల్ కార్లకు గట్టి పోటీ ఇస్తుంది.
మహీంద్రా ఎక్స్యూవీ 700 ఆవిష్కరణకు ముందు ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లయిడ్ ఆటోమోటివ్ రీసెర్చ్ (ఐడీఐఏడీఏ) డిజైన్ మేరకు 454 ఎకరాల విస్తీర్ణంలో ఎల్ అండ్ టీ నిర్మించిన మహీంద్రా ఎస్యూవీ ప్రూవింగ్ ట్రాక్ (ఎంఎస్పీటీ)ని ప్రారంభించారు.