Mahindra EV Mega Plan | దేశంలోని వివిధ ఆటోమొబైల్ కంపెనీలు.. ప్రత్యేకించి కార్ల తయారీ కంపెనీలు విద్యుత్ కార్ల ఆవిష్కరణలో పోటీ పడుతున్నాయి. అందులోనూ దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా ముందు వరుసలో నిలిచింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మహీంద్రా సోమవారం ఐదు న్యూ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కార్లను ఆవిష్కరించింది. 2024-26 మధ్య వీటిని మార్కెట్లోకి తీసుకొస్తామని తెలిపింది. సంస్థ న్యూ ఇంగ్లో ప్లాట్ఫామ్పై రూపుదిద్దుకునే ఈ ఈవీ ఎస్యూవీ కార్లను ఎక్స్యూవీ.ఈ, బీఈ అనే రెండు విభిన్న సబ్బ్రాండ్ల కింద క్లాసిఫై చేసింది.
ఐదు న్యూ ఎలక్ట్రిక్ ఎస్యూవీలు.. ఎక్స్యూవీ.ఈ8, ఎక్స్యూవీ.ఈ9, బీఈ.05, బీఈ.07, బీఈ.09. వీటిల్లో తొలి నాలుగు ఎస్యూవీలను 2024 -26 మధ్య ఆవిష్కరిస్తామని తెలిపింది. లండన్లో జరిగిన ఓ మెగా ఈవెంట్లో మహీంద్రా ఈ కార్లను పరిచయం చేసింది. ఈవీ కార్లన్నీ ఐదు నుంచి ఆరు సెకన్ల గడువులో 100 కి.మీ. స్పీడ్ (కేఎంపీఎల్) అందుకునే సత్తా కలిగి ఉన్నాయి.
ఎలక్ట్రిక్ వెహికిల్స్ కార్ల విభాగంపై 100 బిలియన్ల డాలర్ల (రూ.70,070 కోట్లు) కు పైగా పెట్టుబడి పెట్టాలని మహీంద్రా అండ్ మహీంద్రా తలపోస్తున్నది. ఈ ప్లాన్లో భాగంగానే ఈ ఐదు ఈవీ కార్లను ఆవిష్కరించింది. బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ యూకే డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి రూ.1925 కోట్ల (250 మిలియన్ డాలర్లు) నిధులు సేకరించింది.
తొలుత ఎక్స్యూవీ.ఆ8 ఎస్యూవీ కారును 2024 డిసెంబర్లో ఆవిష్కరించనున్నది. ఎక్స్యూవీ.ఈ9 కారు 2025 ఏప్రిల్, అదే ఏడాది అక్టోబర్లో బీఈ.05, 2026 అక్టోబర్లో బీఈ.07 మార్కెట్లోకి తీసుకు రానున్నది మహీంద్రా అండ్ మహీంద్రా. ఇక బీఈ.09 ఆవిష్కరణ తేదీ ఇంకా ఖరారు కాలేదు.