ముంబై, ఏప్రిల్ 7 : మహీంద్రా ట్రాక్టర్లు మరింత ప్రియంకాబోతున్నాయి. ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చేలా అన్ని రకాల ట్రాక్టర్ల ధరలను సవరిస్తున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎంత శాతం మేర పెంచుతున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు.
ఉత్పత్తి వ్యయం అధికం కావడం ధరలు పెంచాల్సి వస్తున్నదని మహీంద్రా గ్రూపు వర్గాలు వెల్లడించాయి. అలాగే స్వరాజ్ ట్రాక్టర్స్ కూడా ఈ నెల 21 నుంచి అమల్లోకి వచ్చేలా ధరలను సవరిస్తున్నట్టు తెలిపింది.