హైదరాబాద్, మార్చి 19: మహీంద్రా గ్రూపునకు చెందిన మహీంద్రా ట్రాక్టర్.. దేశీయ మార్కెట్లో ఓజా సిరీస్లో నయ ట్రాక్టర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. రైతులకు ఉపయోగపడే విధంగా తక్కువ బరువుతో రూపొందించిన 4 డబ్ల్యూడీ మహీంద్రా ఓజా 3140 మాడల్ను ప్రస్తుత సీజన్ను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టింది. 30-40 హెచ్పీ సామర్థ్యంతో రూపొందించిన ఈ ట్రాక్టర్ ప్రారంభ ధర రూ.7.35 లక్షలు.
ఈ ధరలు తెలుగు రాష్ర్టాలకు సంబంధించినవి. అడ్వాన్స్ గేర్ సిస్టమ్తో రూపొందించిన ఈ ట్రాక్టర్లో మొత్తంగా 24 గేర్లు ఉన్నాయి. చిన్న స్థాయి రైతులు సులభంగా, సురక్షితంగా వేగవంతంగా తమ భూమిని చదును చేసుకునే విధంగా దీనిని రూపొందించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వచ్చే రబీ సీజన్లో ట్రాక్టర్లకు డిమాండ్ ఉంటుందని సంస్థ భావిస్తున్నది. అత్యాధునిక ప్రొజా, మైజా, రోబోజా వంటి టెక్నాలజీతో తయారైన ఈ మాడల్ పనితీరు చాలా మెరుగ్గావుంటుందని తెలిపింది.