దేశీయంగా అత్యంత ప్రజాదరణ పొందిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనమైన థార్ను సరికొత్తగా మళ్లీ దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది మహీంద్రా అండ్ మహీంద్రా. ఈ కారు ప్రారంభ ధర రూ.9.99 లక్షలు.
ఈ ధరలు ఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. డీజిల్ ఇంజిన్ మాన్యువల్ రియర్ వీల్ డ్రైవ్ కలిగిన మోడల్ ధరను రూ.9.99 లక్షల నుంచి రూ.10.99 లక్షల మధ్యలో నిర్ణయించిన సంస్థ..పెట్రోల్ ఆటోమేటిక్ రకం ధరను రూ.13.49 లక్షలుగా నిర్ణయించింది. 4 వీల్ డ్రైవ్ కలిగిన మోడల్ అడ్వాన్స్ ఎలక్ట్రానిక్ బ్రేక్ లాకింగ్ సిస్టమ్తో రూపొందించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
– న్యూఢిల్లీ, జనవరి 9