RBI To Mahindra Finance | రుణాల వసూళ్లకు `ఔట్ సైడ్ రికవరీ ఏజంట్ల`ను వినియోగించొద్దని మహీంద్రా ఫైనాన్స్ సంస్థకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) మార్గనిర్దేశం చేసింది. తక్షణం ఔట్ సోర్సింగ్ ఏజంట్ల ద్వారా రుణ వసూళ్ల ప్రక్రియ నిలిపివేయాలని ఆదేశించింది. జార్ఖండ్ రాష్ట్రం హజారీబాగ్ జిల్లాలో మహీంద్రా ఫైనాన్స్ సంస్థ రికవరీ ఏజంట్.. ట్రాక్టర్ రుణం చెల్లించడంలో విఫలమైంది. దీంతో గర్భిణీ మీదుగా రుణ రికవరీ ఏజంట్ ట్రాక్టర్ నడిపించడంతో ఆమె మరణించిన నేపథ్యంలో ఆర్బీఐ ఆదేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ ఘటనపై హజారీబాగ్ పోలీసులు కూడా స్పందించారు. రుణం తీసుకున్న వ్యక్తి వద్ద నుంచి ట్రాక్టర్ రికవరీకి వెళ్లినప్పుడు మహీంద్రా ఫైనాన్స్ సంస్థ యాజమాన్యం తమకు సమాచారం ఇవ్వలేదని స్థానిక మీడియాకు చెప్పారు.
`ఈ అంశంపై అన్ని కోణాల్లో మేం దర్యాప్తు చేస్తాం. రుణ బకాయిల వసూళ్లకు థర్డ్ పార్టీ సంస్థల వినియోగాన్ని కూడా పరిశీలిస్తాం. విషాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న బాధిత కుటుంబం పక్షాన మేం నిలుస్తాం` అని మహీంద్రా ఫైనాన్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) డాక్టర్ అనీశ్ షా ఓ ప్రకటనలో తెలిపారు.