ముంబై, మే 26: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా రికార్డు స్థాయి లాభాలను ఆర్జించింది. మార్చితో ముగిసిన త్రైమాసికానికిగాను రూ. 2,637 కోట్ల లాభాన్ని గడించింది. ఆటోమోటివ్, వ్యవసాయ ఉత్పత్తులు, ఆర్థిక సేవల విభాగాలు రాణించడం వల్లనే లాభాల్లో 18 శాతం వృద్ధి నమోదైందని సంస్థ వెల్లడించింది.
2021-22 నాలుగో త్రైమాసికంలో రూ.25, 934 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం గత త్రైమాసికానికిగాను రూ.32,366 కోట్లకు ఎగబాకింది. మరోవైపు, గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.1,21,269 కోట్ల ఆదాయంపై రూ.10,282 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది.