న్యూఢిల్లీ, ఆగస్టు 18: కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్..దేశీయంగా తయారైన ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. గెలాక్సీ సిరీస్లో భాగంగా జెడ్ ఫ్లిప్ 5, జెడ్ ఫోల్డ్ మాడళ్లను ఢిల్లీకి సమీపంలో ఉన్న ప్లాంట్లోనే తయారు చేసింది.
వీటిలో గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 5 మాడల్ రూ.99,999 నుంచి రూ.1,09,999 లోపు, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 5 మాడల్ రూ.1.54 లక్షల నుంచి రూ.1.84 లక్షల లోపు ధరను నిర్ణయించింది. ఈ రెండు సిరీస్ ఫోన్లకు భారత్లో మంచి డిమాండ్ ఉన్నదని, ముందస్తు బుకింగ్లు ఆరంభించిన 28 గంటల్లోనే లక్షకు పైగా బుకింగ్లు వచ్చాయని కంపెనీ పేర్కొంది.