Market Capitalisation | దేశీయ స్టాక్ మార్కెట్లలో గత వారం జరిగిన ట్రేడింగ్లో టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,50,679.28 లక్షల కోట్లు పెరిగింది. వాటిల్లో ఐటీ దిగ్గజాలు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్ భారీగా లబ్ధి పొందాయి. గత వారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 890.5 పాయింట్లు (1.35 శాతం) లబ్ధి పొందింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్ లబ్ధి పొందాయి. మరోవైపు ఐసీఐసీఐ బ్యాంక్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), బజాజ్ ఫైనాన్స్ నష్టాలను చవి చూశాయి.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,148.99 కోట్ల లబ్ధితో 12,81,637.63 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.28,616.98 కోట్లు పుంజుకుని రూ.5,96,681.75 కోట్ల వద్ద స్థిర పడింది. రిలయన్స్ ఎం-క్యాప్ రూ.28,111.41 కోట్ల లబ్ధితో రూ.15,93,893.03 కోట్ల వద్ద నిలిచింది.
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,136.61 కోట్ల లబ్ధితో రూ.11,42,215.81 కోట్ల వద్ద ముగిసింది. హిందూస్థాన్ యూనీ లివర్ ఎం-క్యాప్ రూ.10,032.75 కోట్ల లాభంతో రూ.5,94,317.36 కోట్లకు చేరుకున్నది. భారతీ ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6,828.74 కోట్ల లబ్ధితో రూ.5,32,585.63 కోట్ల వద్ద ముగిసింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.3,803.8 కోట్లు పుంజుకుని రూ.5,47,808.43 కోట్ల వద్ద స్థిర పడింది.
మరోవైపు భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14,502.5 కోట్ల నష్టంతో రూ.5,02,589.52 కోట్లతో సరిపెట్టుకున్నది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.11.,308.97 కోట్ల పతనంతో రూ.6,46,254.41 కోట్ల వద్ద ముగిసింది. బజాజ్ పైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.4,973.68 కోట్ల నుంచి రూ.4,46,169.40 కోట్లకు పడిపోయింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్పోసిస్, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ, భారతీ ఎయిర్ టెల్, భారతీయ స్టేట్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ నిలిచాయి.