న్యూఢిల్లీ : భారత్లో లగ్జరీ కార్ల విక్రయాలు ఊపందుకున్నాయి. లంబోర్గిని, పోర్షే, మెర్సిడెస్ బెంజ్, లెక్సస్ వంటి లగ్జరీ కార్ బ్రాండ్లు 2022లో బంపర్ సేల్స్ సాధించడంతో రాబోయే సంవత్సరాల్లో విక్రయాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆశిస్తున్నాయి. ఇటాలియన్ సూపర్ లగ్జరీ కారు తయారీ కంపెనీ లంబోర్గిని భారత్లో లక్ష్యానికి అనుగుణంగా కార్ల విక్రయాలను పూర్తిచేసింది. భారత్లో లంబోర్గిని కార్లు ఉరస్ రూ. 3.15 కోట్ల నుంచి అందుబాటులో ఉండగా అవెంటడర్ రూ. 9 కోట్లు పలుకుతోంది.
2023లో 100కుపైగా కార్లు సేల్ అవుతాయని అంచనా వేస్తున్నామని, వీటిలో చాలా వరకూ ఆర్డర్ వచ్చాయని లంబోర్గిని ఆసియా పసిఫిక్ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో స్కర్దోని తెలిపారు. 2023 టార్గెట్ సేల్స్ఃతో పాటు డెలివరీలను దాదాపు పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. కొవిడ్ ప్రభావం తగ్గడంతో వ్యాపారవేత్తలు, అత్యధిక సంపద కలిగిన వారు లగ్జరీ కార్ల కొనుగోలుకు మొగ్గుచూపుతుండటంతో ఈ సెగ్మెంట్లో కార్లకు డిమాండ్ పెరిగిందని స్కర్దోని తెలిపారు.
2022లో లంబోర్గిని భారత్లో 30 శాతం అధికంగా 90 లగ్జరీ కార్లను విక్రయించింది. ఇక ఆడి సైతం రాబోయే రెండేండ్లలో తమ సేల్స్ను మూడింతలు పెంచుకోవాలని లక్ష్యంగా నిర్ధేశించుకుంది. పలు మోడల్స్ లాంఛ్, సెమికండక్టర్ల లభ్యత మెరుగవడం, భారత్లో లగ్జరీ కార్లకు డిమాండ్ పెరగడంతో భారీ సేల్స్ టార్గెట్ను సెట్ చేసుకుంది. ఇక పోర్షే సైతం 2022లో లగ్జరీ కార్ల విక్రయంలో 64 శాతం వృద్ధి సాధించింది. గత ఏడాది పోర్షే భారత్లో 64 శాతం అధికంగా 779 కార్లను విక్రయించింది.