హైదరాబాద్, జనవరి 14: స్మార్ట్మొబైల్ రిటైల్ రంగంలో పేరొందిన లాట్ మొబైల్స్..సంక్రాంతి పండుగ సందర్భంగా పలు ఆఫర్లను ప్రకటించింది. ఎస్బీఐ కార్డ్, మొబిక్విక్ వాలెట్ ద్వారా కొనుగోలు చేసే మొబైల్స్పై 5 శాతం తక్షణ క్యాష్బ్యాక్ లభిస్తుందని లాట్ మొబైల్స్ ప్రకటన తెలిపింది. వివో మొబైల్స్ కొనుగోలుపై 10 శాతం, వన్ప్లస్ మొబైల్స్పై రూ. 6,000 వరకూ క్యాష్బ్యాక్ ఆఫర్ ఇస్తున్నట్లు తెలిపింది. స్మార్ట్ టీవీల కొనుగోలుపై రూ.7,000 వరకూ క్యాష్బ్యాక్ లభిస్తుంది. స్మార్ట్ టీవీ ఎక్సేంజ్ ఆఫర్ను సైతం లాట్ మొబైల్స్ ప్రకటించింది. పాత టీవీని తీసుకొచ్చి, కొత్త స్మార్ట్ టీవీని కొంటే రూ. 3,500 వరకూ ఎక్సేంజ్ బోనస్ పొందవచ్చని తెలిపింది. హెచ్పీ, రియల్మీ ల్యాప్ టాప్స్ కొనుగోలుపై రూ. 2,500 వరకూ క్యాష్బ్యాక్ లభిస్తుంది. శామ్సంగ్, నోకియా, రియల్మి ట్యాబ్స్ కొనుగోలుపై 5 శాతం వరకూ క్యాష్బ్యాక్ ఇస్తారు. పలు బ్రాండెడ్ యాక్సెసరీస్పై కూడా ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తున్నామని, సంక్రాంతి ఆఫర్లను ఉపయోగించుకోవాలని లాట్ మొబైల్స్ డైరెక్టర్ అఖిల్.యం వినియోగదారుల్ని కోరారు.