న్యూఢిల్లీ : ఫ్రాన్స్ను మట్టికరిపించి ఫిఫా వరల్డ్ కప్ 20022ను అర్జెంటీనా ఎగరేసుకుపోయింది. చారిత్రాత్మక విజయాన్ని అర్జెంటీనా ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూనే ఉంది. అర్జంటీనా టీమ్, స్టాఫ్ కోసం స్టార్ ఫుట్బాలర్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) రూ. 1.73 కోట్ల విలువైన 35 గోల్డ్ ఐఫోన్లను ఆర్డర్ చేశాడు. ఈ స్పెషల్ గోల్డ్ డివైజ్లపై ప్రతి ఆటగాడి పేర్లు, జెర్సీ నెంబర్లు, అర్జెంటీనా లోగోను ముద్రించారు.
ఈ ఐఫోన్లు వారాంతంలో మెస్సీ అపార్ట్మెంట్కు చేరుకున్నాయని సమాచారం. ఫిఫా వరల్డ్ కప్ అర్జెంటీనా సొంతం కావడంతో ఈ వేడుకను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని ఆటగాళ్లకు ప్రత్యేకమైన బహుమతులు అందించాలని మెస్సీ భావిస్తున్నారు. ఎంట్రప్రెన్యూర్ బన్ లైన్స్తో కలిసి మెస్సీ డివైజ్ల డిజైన్ను రూపొందించారని ది సన్ వెల్లడించింది.
టీం సభ్యులకు, సపోర్ట్ స్టాఫ్కు మెస్సీ గోల్డ్ ఐఫోన్గా ఐఫోన్ 14ను ఎంచుకున్నారు. ఫోన్ డిజైన్తో పాటు ఐఫోన్లను మెస్సీ రిసీవ్ చేసుకున్న ఫొటోను ఐడిజైన్ గోల్డ్ అధికారిక ఇన్స్టాగ్రాం ఖాతా వెల్లడించింది. వరల్డ్ కప్ ఫైనల్లో గెలుపొందిన మెస్సీ ఆయన టీం సభ్యులు, స్టాఫ్ కోసం 35 గోల్డ్ ఐఫోన్లను డెలివరీ చేయడం గౌరవంగా భావిస్తున్నామని ఈ పోస్ట్కు క్యాప్షన్గా ఇచ్చారు. గోల్డ్ ఐఫోన్స్, ఐఫోన్ కేస్లు వంటి లగ్జరీ స్మార్ట్ఫోన్ డివైజ్లను రూపొందించే కంపెనీగా ఐడిజైన్ గోల్డ్ పేరొందింది.
Read More :