హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): సేల్స్ అండ్ మార్కెటింగ్లో లైట్ హౌస్ ప్రాపర్టీస్ సంస్థ అగ్రగామిగా పేరు ప్రాఖ్యాతలు సంపాదించుకున్నట్లు సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ మంజునాథరెడ్డి తెలిపారు. 2012లో తన మార్కెటింగ్ ప్రస్థానాన్ని ప్రారంభించిందని, 11 ఏండ్లలోనే వివిధ ప్రాజెక్టుల్లో ప్లాట్స్, అపార్ట్మెంట్స అమ్మకాల్లో అగ్రస్థానాన్ని నిర్మించుకున్నదని పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరం చుట్టూ అనేక సంస్థలతో కలిసి మార్కెటింగ్ చేసినట్లు తెలిపారు.
అనుమతులు కలిగిన 4లక్షల గజాలకు పైగా మార్కెటింగ్..
ఇప్పటి వరకు లైట్హౌస్ ప్రాపర్టీ 4 లక్షల గజాల కంటే ఎక్కువ 2,800 పైబడి కస్టమర్లకు మార్కెటింగ్ చేయగలిగిందని వివరించారు. 60గజాల నుంచి మొదలుకొని 6వేల గజాల వరకు కొనుగోలుదారులకు మార్కెటింగ్ చేయగలిగామని చెప్పారు. హెచ్ఎండీఏ, డీటీసీపీ, రేరా అనుమలు ఉన్నవాటినే మార్కెటింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ నుంచి ఆటో మేకర్ వరకు అన్ని వర్గాలకు చేరువ కావాలనే ఉద్దేశంతో వారి బడ్జెట్కు సరితూగేలా మార్కెం గ్ చేయడం తమ ధ్యేయమన్నారు. ఇందుకోసం 60 మంది కంటే ఎక్కువ స్టాఫ్ ఉన్నట్లు, ముఖ్యంగా ఇందులో 50 శాతం కంటే ఎక్కువ మహిళా ఉద్యోగులు ఉంటారని చెప్పారు.
నమ్మకం, పారదర్శకత, లక్ష్యం
కొనుగోలు, అమ్మకందారులకు నమ్మకం కలిగేవిధంగా, పారదర్శకత, కొనుగోలు చేసిన స్తిరాస్థిని రీసేల్కు తమ సంస్థ కృషిచేస్తున్నదని వివరించారు. ప్రజా శ్రేయస్సు కోసం అవకాశాలను సృష్టించడంతో పాటు 2030 నాటికి 5వేల పెట్టుబడులు సృష్టించేదుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
సోల్డ్ అవుట్ ప్రాజెక్టులు..
ఇప్పటి వరకు సోల్డ్ అవుట్ ప్రాజెక్టులు.. షాద్నగర్లో సిల్వర్ లీఫ్, లార్విన్ ప్లాటినా, కాస్మొ ఎలైట్, అమూల్య గ్రీన్ వ్యాలీ, దర్బార్ (అపార్ట్మెంట్స్)తోపాటు శ్రీనిధి యొక్క గరుడ, వెంకట, శేష లాంటి వాటిలో మార్కెటింగ్ పూర్తిచేసినట్లు వెల్లడించారు.
ఆన్గోయింగ్ ప్రాజెక్టులు..
ఆన్గోయింగ్ ప్రాజెక్టులు.. ఫార్మా కౌంటీ, కాస్మొ సెలెక్స్, కాస్పొ పొలీస్ (ఫార్మా సిటీ, అమెజాన్ డాటా సెంటర్), సౌత్ ఫీల్డ్స్, విజ్లిం గ్ వుడ్స్ (మహేశ్వరం, మన్సాన్పల్లి), విలాసం (అపార్ట్మెంట్స్-అమీన్పూర్) లాంటి ప్రాజెక్టులు కొనసాగతున్నాయని మంజునాథరెడ్డి వివరించారు. కొన్ని సంస్థలతో జాయింట్ వెం చర్లలో భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. ఎంకార్ ఎల్ఎల్పీ ప్రాజెక్టు (Mcor) సంస్థతో కలిసి దర్బార్ (అపార్ట్మెంట్స్- అమీన్పూర్) ప్రాజెక్టును 25 ఫ్లాట్లను 14 నెలల్లో పూర్తిచేసి కస్టమర్లకు అప్పగించామన్నారు. విలాసం (అపార్ట్మెంట్స్) పేరుతో కొనసాగే ప్రాజెక్టులో 50 ఫ్లాట్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు.