LIC | న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) ప్రీమియం వసూళ్లలో దూసుకుపోతున్నది. మార్చి నెలలో మొత్తం ప్రీమియం వసూళ్లు ఏడాది ప్రాతిపదికన 26.41 శాతం ఎగబాకి రూ.36,300.62 కోట్లకు చేరుకున్నాయి. క్రితం ఏడాది ఇది రూ.28,716.23 కోట్లుగా ఉన్నాయి.
ఎల్ఐసీ తర్వాత ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం వసూళ్లు 24.76 శాతం పెరగగా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ 12.58 శాతం వృద్ధిని కనబరిచాయి. కానీ, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రీమియం వసూళ్లు 20 శాతం పడిపోయాయి. 58.87 శాతం మార్కెట్ వాటాతో ఎల్ఐసీ తొలి స్థానంలో నిలిచింది. మరోవైపు, ప్రపంచ భలమైన బీమా బ్రాండ్లలో ఎల్ఐసీ తొలిస్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.