న్యూఢిల్లీ, డిసెంబర్ 27: మార్కెట్ బుల్న్త్రో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కు (ఎల్ఐసీ) లాభాల పంట పండింది. ఐపీవో ధరతో పోలిస్తే ఎల్ఐసీ షేరు విలువ ఇప్పటికీ వెనుకపడే ఉన్నప్పటికీ, ఈక్విటీ పోర్ట్ఫోలియోలో ఉన్న దిగ్గజ షేర్లతో 2023లో సంస్థ రూ.2.8 లక్షల కోట్ల భారీ లాభాన్ని ఆర్జించగలిగింది. ఎల్ఐసీకి దేశంలోని దాదాపు 260 లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి.
నిరుడు డిసెంబర్లో 9.61 లక్షల కోట్లు ఉన్న ఈక్విటీ పోర్ట్ఫోలియో విలువ రూ.11.89 లక్షల కోట్లకు పెరిగింది. ఏడాదికాలంగా నిఫ్టీ 18 శాతం పెరగడంతో ఎల్ఐసీ వద్దనున్న నిఫ్టీ-50 షేర్లే భారీ రాబడుల్ని అందించాయి. అన్నింటికంటే అధికంగా లార్సన్ అండ్ టూబ్రో రూ.16 వేల కోట్ల లాభాన్ని ఇవ్వగా, కోల్ ఇండియా రూ.10 వేల కోట్లకుపైగా రాబడినిచ్చింది. సంస్థకు భారీ లాభాల్ని ఇచ్చిన టాప్-ఫైవ్ షేర్లలో ఈ రెండింటితో పాటు ఎన్టీపీసీ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్లు ఉన్నాయి.