LIC- Jeevan Dhara II | భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) తన పాలసీదారుల కోసం శుక్రవారం నూతన సేవింగ్స్ అండ్ యాన్యూటీ ప్లాన్ `జీవన్ ధార-2` ప్రకటించింది. సోమవారం నుంచి పాలసీల విక్రయం ప్రారంభం అవుతుంది. ఈ పాలసీల కొనుగోలుకు కనీస అర్హత 20 ఏండ్ల వయస్సుగా నిర్ణయించింది. నాన్-లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత సేవింగ్స్, వేర్వేరు యాన్యుటీ ప్లాన్లు ఉంటాయి. పాలసీ కొనుగోలు చేసినప్పటి నుంచి యాన్యుటీ గ్యారంటీ ఆఫర్ చేస్తోంది ఎల్ఐసీ. పాలసీదారులకు 11 యాన్యుటీ ఆప్షన్లు ఆఫర్ చేసింది. పాలసీదారులు రెగ్యులర్గా, సింగిల్ ప్రీమియం వారీగా యాన్యుటీ ఆప్షన్లు ఎంచుకునే ఫ్లెక్సిబిలిటీ కల్పించింది.
పెద్ద వయస్సు గల వారికి అధిక యాన్యుటీ రేట్ కల్పిస్తున్న ఈ పాలసీ లైఫ్ కవరేజీ పీరియడ్లో తేడాలు ఉన్నాయి. రెగ్యులర్ ప్రీమియం తీసుకున్నట్లయితే ఐదేండ్ల నుంచి 15 ఏండ్ల లోపు, సింగిల్ ప్రీమియం అయితే ఏడాది నుంచి 15 ఏండ్లు ప్రీమియం ఉంటుంది. ఈ పాలసీదారులకు రుణ పరపతి కూడా కల్పిస్తున్టన్లు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతి తెలిపారు.