ముంబై, డిసెంబర్ 21: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో 25 శాతం కనీస పబ్లిక్ వాటాను పదేండ్లలోపు పెంచుకునే మినహాయింపును కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ సంస్థకు మంజూరు చేసింది. 2022 మే నెలలో ఎల్ఐసీ ఐపీవో ద్వారా ప్రభుత్వం 3.5 శాతం వాటాను (22 కోట్ల షేర్లు) విక్రయించింది. ప్రస్తుతం ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. వాస్తవానికి సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీలు పబ్లిక్కు కనీసం 25 శాతం వాటాను ఆఫ్లోడ్ చేయాల్సి ఉంటుంది.
కానీ ప్రజా ప్రయోజనాల రీత్యా లిస్టెడ్ ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించేలా 2021లో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నేపథ్యంలో ఎల్ఐసీకి లిస్టింగ్ తేదీ నుంచి పదేండ్లు (2032 మే వరకూ) కనీస పబ్లిక్ వాటా మినహాయింపును ఇచ్చినట్టు సంస్థ స్టాక్ ఎక్సేంజ్లకు తెలిపింది.