న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ఇన్వెస్టర్లు ఆసక్తిగా వేచిచూస్తున్న ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) ఐపీవోలో ఆ సంస్థ పాలసీహోల్డర్లకు డిస్కౌంట్ ధరను ఆఫర్ చేయనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఐపీవో ఇష్యూ ధరకంటే 5 శాతం తక్కువ ధరను పాలసీహోల్డర్లకు ఇస్తారన్నది సమాచారం. రిటైల్ ఇన్వెస్టర్లు, సంస్థ ఉద్యోగులకు కూడా ఇష్యూ ధరల శ్రేణిపై కొంత వరకూ రాయితీ ఉంటుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్కు సంబంధించిన ముసాయిదా ప్రాస్పెక్టస్ను ఫిబ్రవరి 10 మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సమర్పించనున్నట్లు ఇష్యూ వ్యవహారాలు చూస్తున్న వర్గాలు తెలిపాయి.