హైదరాబాద్, మార్చి 7: ప్రపంచంలో అతిపెద్ద కన్జ్యూమర్ డ్యూరబుల్ ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ సంస్థ ఎల్జీ…హైదరాబాద్లో గ్రాండ్ టెక్ కార్యక్రమాన్ని నిర్వహించింది. రీఇన్వెంట్”ఇన్నోవేషన్’లో భాగంగా కంపెనీకి చెందిన అన్ని రకాల 136 ఉత్పత్తులను ప్రదర్శించింది.
ప్రతియేటా జరిగే ఈ గ్రాండ్ టెక్ కార్యక్రమం ఈసారి సెమినార్ రూపంలో నిర్వహించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ హేమెందు సిన్హా మాట్లాడుతూ..దేశీయ కస్టమర్లకు బెస్ట్ ఉత్పత్తులను అందించడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు.