న్యూఢిల్లీ, అక్టోబర్ 14: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ పరికరాల సంస్థ ఎల్జీ..దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. న్యూ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులతో ఎలక్ట్రానిక్స్ పరికరాలను కొనుగోలు చేసిన వారికి 20 శాతం వరకు ఇన్స్టాంట్ క్యాష్బ్యాక్ ఆఫర్ను కల్పిస్తున్నది. అలాగే ఎంపిక చేసిన ఉత్పత్తులపై జీరో డౌన్పేమెంట్తోపాటు ఒక్క నెల ఉచిత ఈఎంఐ, రూ.888కే ప్రారంభ నెలవారి ఈఎంఐ, పలు టీవీలపై ఐదేండ్లపాటు వ్యారెంటీని ఇస్తున్న సంస్థ..దీనిని కస్టమర్ పదేండ్ల వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. పలు ఒలెడ్ టీవీలపై 80 సెంటిమీటర్ల టీవీని ఉచితంగా అందిస్తున్న సంస్థ..సెలెక్ట్ ఒలెడ్ టీవీపై రూ.64,990 విలువైన సౌండ్బార్ను ఉచితంగా అందిస్తున్నది. ఎల్జీ ఒలెడ్ టీవీ మోడళ్ళపై రూ.2,990 విలువైన ఈయర్బడ్స్ను ఉచితంగాను ఇస్తున్నది.
హైదరాబాద్లో సర్వీస్ సెంటర్
హైదరాబాద్లో సర్వీసింగ్ సెంటర్ను ఆరంభించింది ఎల్జీ. ఈ సెంటర్తో కస్టర్లకు నాణ్యమైన సేవలు అందించడానికి వీలు పడనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. దీంతో సంస్థకు ఇది 53 సర్వీస్ సెంటర్ కావడం విశేషం.