ధర రూ.64.90 లక్షలు
న్యూఢిల్లీ, మార్చి 9: జపాన్కు చెందిన ఆటోమొబైల్ దిగ్గజం టయోటా లగ్జరీ విభాగ సంస్థ లెక్సస్..దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఎస్యూవీని పరిచయం చేసింది. రూ.64.90 లక్షల ప్రారంభ ధరతో లభించనున్న ఈ మోడల్ పేరు ‘ఎన్ఎక్స్ 350 హెచ్’ గా నిర్ణయించింది. మూడు రకాల్లో లభించనున్న ఈ మోడల్ ధరలు వరుసగా రూ.64.9 లక్షలు, రూ.69.50 లక్షలు, రూ.71.60 లక్షలు. 2.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ హైబ్రిడ్ మోడల్తో లగ్జరీ కార్ల విభాగం మరింత బలోపేతం అయ్యే అవకాశాలున్నాయని కంపెనీ వర్గాలు వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచే ముందస్తు బుకింగ్లు ఆరంభించిన సంస్థ..బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 14 అంగుళాల టచ్స్క్రీన్ డిస్ప్లే కలిగిన ఈ కారులో వైర్లెస్ చార్జింగ్, సులువుగా స్మార్ట్ఫోన్ కనెక్షన్ చేసుకునేందుకు సాంకేతికలో మార్పులు చేసింది.