Maruti Suzuki : కొత్త ఏడాది కార్ల ధరలకు రెక్కలొస్తున్నాయి. ముడిపదార్ధాల ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల పేరిట ఆటోమొబైల్ కంపెనీలు కొనుగోలుదారులపై భారం మోపుతున్నాయి. ఇక ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి తన వాహనాల ధరలను పెంచింది.
ద్రవ్యోల్బణం, ముడిపదార్ధాల ధరలు ఎగబాకడంతో వాహన మోడల్స్ అన్నింటి ధరలను సగటున 0.45 శాతం పెంచింది. వాహనాల పెంపు తక్షణం అమల్లోకి వస్తుందని స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం అందించింది. వాహనాల ధరల పెంపు నిర్ణయంతో స్టాక్ మార్కెట్లో మారుతి సుజుకి షేర్లు మంగళవారం ప్రారంభ సెషన్లో దాదాపు 1.5 శాతం లాభపడ్డాయి.
ఇక మరో దేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ సైతం ముడిపదార్ధాల ధరల పెరుగుదలతో తమ వాహనాల ధరలను ఈ ఏడాది జనవరిలో పెంచాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, హోండా కార్స్ ఇండియా, లగ్జీరీ కార్ల తయారీ కంపెనీ ఆడి సైతం ఈ నెలలో తమ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి.
Read More :