న్యూఢిల్లీ, ఆగస్టు 15: ఓలా ఎలక్ట్రిక్.. దేశీయ మార్కెట్కు ఎంట్రీ లేవల్ ఎలక్ట్రిక్ స్కూటర్ను పరిచయం చేసింది. ఎస్1ఎక్స్ పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధరను రూ.79,999గా నిర్ణయించింది. ఈ నూతన ఎస్1ఎక్స్ మాడల్ మూడు రకాల్లో ఎస్1ఎక్స్(2 కిలోవాట్ల బ్యాటరీ), ఎస్1ఎక్స్(3 కిలోవాట్ల బ్యాటరీ), ఎస్1ఎక్స్+ కూడా 3 కిలోవాట్ల బ్యాటరీతో తయారైన ఈ స్కూటర్లలో పలు నూతన ఫీచర్స్తో తయారు చేసినట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో భావిష్ అగర్వాల్ తెలిపారు. వీటిలో 2 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఎస్1ఎక్స్ ధర రూ.79,999 మాత్రమేనని, ఈ ధరలు తొలి వారం మాత్రమే ఉంటాయని, ఆ తర్వాత ఈ స్కూటర్ ధరను రూ.89,999కి పెంచనున్నట్లు ఆయన చెప్పారు. బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు డిసెంబర్ నుంచి డెలివరీ చేయనున్నట్లు ఆయన చెప్పారు.