డిపాజిట్లను ఆకట్టుకోవడానికి ఒక్కో బ్యాంక్ క్రమంగా వడ్డీరేట్లను పెంచుతున్నాయి. దీంట్లో భాగంగా కొటక్ మహీంద్రా బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.80 శాతం వరకు పెంచింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లపై సీనియర్లకు అదనంగా 85 బేసిస్ పాయింట్లు వడ్డీని పెంచింది. 23 నెలల నుంచి మూడేండ్ల లోపు డిపాజిట్లపై రెగ్యులర్ వడ్డీరేటును స్థిరంగా ఉంచిన బ్యాంక్.. సీనియర్ సిటిజన్లుకు మాత్రం ఐదు బేసిస్ పాయింట్లు సవరించింది.
కానీ, మూ డేండ్ల నుంచి నాలుగేండ్ల లోపు డిపాజిట్లపై వడ్డీని అర శాతం సవరించింది. దీంతో రెగ్యలర్ వడ్డీరేటు 6.50 శాతం నుంచి 7 శాతానికి చేరుకోగా, సీనియర్ సిటిజన్లకు 7 శాతం నుంచి 7.60 శాతానికి చేరుకున్నది. అలాగే నాలుగేండ్ల నుంచి ఐదేండ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై రేటును 6.25 శాతం నుంచి 7 శాతానికి, సీనియర్ సిటిజన్లకు 7.60 శాతానికి పెంచింది.