Kotak Mahindra | న్యూఢిల్లీ, మార్చి 28: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) సొనాటా ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ను రూ.537 కోట్లకు సొంతం చేసుకున్నట్టు కొటక్ మహీంద్రా బ్యాంక్ గురువారం ప్రకటించింది. 10 రాష్ర్టాల్లో సొనాటాకు 549 శాఖలున్నాయి.
గత ఏడాది డిసెంబర్ 31 నాటికి ఈ సంస్థ ఆధ్వర్యంలోని ఆస్తులు (ఏయూఎం) దాదాపు రూ. 2,620 కోట్లుగా ఉన్నాయి. కాగా, ఈ లావాదేవీతో సొనాటా.. ఇకపై కొటక్ బ్యాంక్ అనుబంధ సంస్థగా మారింది.