WhatsApp | గతంతో పోలిస్తే ఇప్పుడు ఆర్థిక లావాదేవీలన్నీ ఆన్ లైన్ వేదికగానే జరుగుతున్నాయి. యూజర్ల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని సైబర్ మోసగాళ్లు ఖాతాల హ్యాకింగ్, వాట్సాప్ కాలింగ్, మోసపూరిత లింక్లు వారి మనీ తస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ, కేంద్ర ఆర్థికశాఖ, పోలీసు యంత్రాంగం ఆన్ లైన్ లావాదేవీలకు సెక్యూరిటీ చర్యలు పెంపొందిస్తున్నది. అయినా, ఎప్పటికప్పుడు సైబర్ మోసగాళ్లు కొత్త పద్ధతుల్లో ప్రజల మనీ దోచేస్తున్నారు. ఇటీవలి కాలంలో నకిలీ ఫేస్ బుక్ ఖాతాలు క్రియేట్ చేసి వారి స్నేహితులను డబ్బు అడుతున్నారు. తాజాగా వాట్సాప్ ఖాతాలు హ్యాక్ చేసి సైబర్ నేరాలు చేస్తున్నారు. దీనిపై కోల్కతా పోలీసులకు పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. వాట్సాప్ ఖాతాలను సైబర్ మోసగాళ్లు ఎలా హ్యాక్ చేస్తున్నారో తెలుసుకుందాం..
సైబర్ మోసగాళ్లు ఒక వ్యక్తి పేరిట నకిలీ ఫేస్బుక్ ఖాతా క్రియేట్ చేస్తారు. ఆ వ్యక్తి ఫ్రెండ్స్ జాబితాలోని వ్యక్తులకు వ్యక్తిగత మెసేంజర్ లింక్ పంపుతారు. యోగా క్లాసులనీ, ఇన్ స్టంట్ రుణాలనీ, ప్రముఖ సంస్థల బ్రాండ్ల పంపిన మెసేంజర్ లింక్లు క్లిక్ చేసి.. తర్వాత వచ్చే ఓటీపీ తమకు చెప్పాలని సూచిస్తున్నారు. ఇది వాస్తవంగా వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్. వేరే ఫోన్ లో లాగిన్ కావడానికి ఓటీపీ పంపుతారు. అలా వచ్చిన ఓటీపీని పంపితే మీ వాట్సాప్ ఖాతా సైబర్ మోసగాళ్ల ఆధీనంలోకి వెళుతుందని పోలీసులు చెబుతున్నారు. ఏ పేరుతో లింక్ పంపినా వెరిఫికేషన్ కోడ్ పొందడానికి సైబర్ మోసగాళ్లు వేసే ఎత్తుగడ అని చెబుతున్నారు.
అలా అకౌంట్ హ్యాక్ చేశాక బాధితుడి కాంటాక్ట్ లిస్టులో గల వారిని ఎమర్జెన్సీ పేరిట సంప్రదించడం, క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులు పెట్టాలని మోసగిస్తుంటారని పోలీసులు చెప్పారు. కనుక యూజర్లు రోజురోజుకు కొత్త రూపం సంతరించుకుంటున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సైబర్ మోసగాల్లు పంపే లింక్ లు క్లిక్ చేసి వాటిల్లో ఓటీపీ షేర్ చేయొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.