హైదరాబాద్, మే 14: హైదరాబాద్ కేంద్రస్థానంగా వైద్య సేవలు అందిస్తున్న కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(కిమ్స్)..తాజాగా నాసిక్లో మల్టీ-స్పెషాల్టీ దవాఖానాను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం స్థానిక సంస్థ డాక్టర్.రాజ్నాగార్కర్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. కిమ్స్ మానవత హాస్పిటల్ పేరుతో నిర్వహించనున్న ఈ దవాఖానాల్లో 325 పడకలు ఉండనున్నాయి. ఈ దవాఖానాలో కిమ్స్కు 51 శాతం వాటా ఉండనుండగా, మిగతా 49 శాతం డాక్టర్.రాజ్ నాగర్కర్కు ఉండనున్నది.
వైద్యరంగంలో 21 ఏండ్లకు పైగా అనుభవం ఉన్న రాజ్ నాగర్కర్ ఇప్పటి వరకు 45 వేలకు పైగా క్యాన్సర్ రోగులకు చికిత్సచేశారు. ఈ నూతన ఆసుపత్రి మార్చి 2024 నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా కిమ్స్ హాస్పిటల్స్ ఎండీ భాస్కర రావు మాట్లాడుతూ..నాసిక్ ఆసుపత్రి ఏర్పాటు చేయనుండటంతో మహారాష్ట్రలో అడుగుపెట్టినట్లు అయిందని, సర్జికల్ హాంకాలజీ లెజెంట్ అయిన డాక్టర్.రాజ్ నాగర్కర్తో కలిసి ఈ దవాఖానాను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ రోగులకు నాణ్యమైన మెడికల్ సేవలు అందించాలనే ఉద్దేశంతో కిమ్స్తో జతకట్టినట్లు రాజ్ నాగర్కర్ తెలిపారు.