Kia India | న్యూఢిల్లీ, మార్చి 21: వచ్చే నెల 1 నుంచి తమ వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు కియా ఇండియా గురువారం ప్రకటించింది. కమోడిటీ ఉత్పత్తుల ధరలు పెరగడం, సరఫరా వ్యవస్థలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించడానికి సెల్టోస్, సోనెట్, కారెన్స్ వాహన ధరలను పెంచకతప్పడం లేదని కియా ఇండియా నేషనల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్ హర్దీప్ సింగ్ తెలిపారు.
కమోడిటీ ఉత్పత్తుల ధరలు నిరాటంకంగా పెరుగుతుండటం, ఎక్సేంజ్ రేట్లలో హెచ్చుతగ్గుదలు, ఉత్పత్తి వ్యయం అధికమవడం వల్లనే కొనుగోలుదారులపై భారం మోపాల్సి వస్తున్నదని పేర్కొంది. ఇప్పటి వరకు సంస్థ 11 లక్షల వాహనాలను దేశీయంగా విక్రయించింది.