న్యూఢిల్లీ, జూన్ 2: కొరియాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం కియా ఇండియా..ఈవీ రంగంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా కియా ఇండియా ఎండీ, సీఈవో తే-జిన్ పార్క్ మాట్లాడుతూ..విద్యుత్ వాహన రంగంలో మా పరిధిని మరింత విస్తరించడానికి రానున్న రోజుల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. 2025 నాటికి ఇక్కడే తయారైన ఈవీ మోడల్ను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. కియా అనుబంధ సంస్థయైన కియా కార్పొరేషన్ ఈవీ రంగంలో 22.22 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈవీ జర్నీలో భాగంగా పలు రకాల మోడళ్ళను ఇక్కడి మార్కెట్కు పరిచయం చేయనున్నట్లు, వచ్చే ఐదేండ్లలో 14 సరికొత్త మోడళ్ళను పరిచయం చేయాలని సంస్థ సంకల్పించిందన్నారు. ఈ మోడల్కు ఇప్పటికే 355 బుకింగ్లు వచ్చాయి. ఈవీ6 పేరుతో విడుదల చేసిన ఈ కారు ప్రారంభ ధర రూ.59.95 లక్షలుగా నిర్ణయించింది. రెండు రకాల్లో లభించనున్న ఈ మోడల్ రూ.59.95 లక్షలు కాగా, మరొకటి రూ.64.95 లక్షలని పేర్కొంది.
ఈవీ6 ప్రత్యేకతలు