Kia on SUVs | దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా ఇండియా.. దేశీయ మార్కెట్లో తన ఎస్యూవీ సెల్టోస్ ఆవిష్కరించిన 2019 నుంచి ఇప్పటి వరకు 50 లక్షలకు పైగా కార్లు విక్రయించింది. దాని స్థానే అప్డేటెడ్ సెల్టోస్ ఫేస్లిఫ్ట్ను మంగళవారం మార్కెట్లో ఆవిష్కరించింది. ఎస్యూవీ సెగ్మెంట్లో మిడ్ సైజ్ ఎస్యూవీ సేల్స్లో సమ్మిళిత గ్రోత్ నమోదవుతుందని కియా ఇండియా విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రతి యేటా ఐదు శాతం గ్రోత్ రికార్డవుతుందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం దేశీయ కార్ల మార్కెట్లో హ్యుండాయ్ తన వాటా ఏడు శాతం నుంచి పది శాతానికి పెంచుకున్నది.
ఈ క్రమంలో భారత్ కార్ల మార్కెట్లో తన వాటా పెంచుకునేందుకు కొత్త మోడల్ కార్లను తేవడంతోపాటు పెట్టుబడులు కూడా పెడుతున్నది. మంగళవారం మార్కెట్లో ఆవిష్కరించిన సెల్టోస్ ఫేస్ లిఫ్ట్ కార్ల బుకింగ్స్ ఈ నెల 14 నుంచి ప్రారంభం అవుతాయి.
గత నాలుగేండ్లుగా కియా సెల్టోస్.. ఎస్ యూవీల్లో 30 శాతం వాటా కలిగి ఉంది. ప్రతిఏటా మిడ్సైజ్ ఎస్యూవీ సేల్స్ ఐదు శాతం పెరుగుతాయని కియా ఇండియా ఎండీ కం సీఈఓ టై జిన్ పార్క్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ బ్రాండ్ ఎస్యూవీ కారుగా కియా సెల్టోస్ నిలిచింది.
2019లో మార్కెట్లో ఆవిష్కరించిన సెల్టోస్ ఇప్పటి వరకు 50 లక్షలకు పైగా కార్లు విక్రయించింది. భారత్ కార్ల మార్కెట్లో ఏడు శాతం వాటా కలిగి ఉంది కియా. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరి వద్ద కియా సెల్టోస్ ఉంది. 2019-20లో భారత్ మార్కెట్లో కియా మోటార్స్ 3.1 శాతం వాటాకు పరిమితమైతే, 2020-21లో 5.7 శాతం, 2021-22లో ఆరు శాతం, 2022-23లో 6.9 శాతానికి పెంచుకున్నది.