న్యూఢిల్లీ : వచ్చే ఏడాది మార్చిలో మార్కెట్లో లాంఛ్ కానున్న కియా కారెన్స్ సెవెన్ సీటర్ త్రీ రో ఎస్యూవీని కియా ఇండియా గురువారం భారత్లో ప్రదర్శించింది. కియా సెల్టోస్కు కొనసాగింపుగా మార్కెట్లోకి రానున్న కారెన్స్ టాటా సఫారీ, ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి ఎస్యూవీలకు దీటైన పోటీ ఇవ్వనుంది. కియా కారెన్స్ను డిస్ప్లే చేసిన కియా ఇండియా న్యూ త్రీ రో ఎస్యూవీ ఇంటీరియర్ డిజైన్ స్కెచ్లనూ వెల్లడించింది.
కియా సెల్టోస్ డిజైన్ను పోలి ఉన్నప్పటికీ కియా కారెన్స్కు వినూత్న ఐడెంటిటీ ఉండేలా కంపెనీ చర్యలు చేపట్టింది. స్లీక్ డిజైన్తో కూడిన స్ల్పిట్ హెడ్ల్యాంప్ సెటప్, కియా సిగ్నేచర్ ఎల్ఈడీ డీఆర్ఎల్స్తో అగ్రెసివ్ స్టైలింగ్ను జోడించింది. కంపెనీ న్యూ టైగర్ గ్రిల్ అప్ఫ్రంట్, అల్లాయ్ వీల్స్ ఎస్యూవీకి స్పోర్టీ టచ్ ఇచ్చాయి.
ఇక కియా కారెన్స్ క్యాబిన్ మినిమల్ అప్రోచ్తో డ్యాస్బోర్డుపై పరిమిత బటన్స్ను ఆఫర్ చేశారు. త్రీస్పోక్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, 10.25 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటెయిన్మెంట్ సిస్టం, ఆల్ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అత్యాధునిక ఫీచర్లున్నాయి. కియా కారెన్స్ సెవెన్ సీటర్ ఎస్యూవీ ధర రూ 15 లక్షల వరకూ ఉంటుందని అంచనా వేస్తున్నారు.