న్యూఢిల్లీ : భారత్లో ఈనెల 15న కియా కారెన్స్ను లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. టయోటా ఇన్నోవా క్రిస్టా, హ్యుందాయ్ అల్కాజర్ల మధ్య ఈ మూడు వరసల రిక్రియేషనల్ వెహికల్ కుదురుకుంటుందని కియా ఇండియా భావిస్తోంది. కంపెనీ వెబ్సైట్తో పాటు డీలర్ల వద్ద రూ 25,000 చెల్లించి కియా కారెన్స్ను బుక్ చేసుకోవచ్చు.
6,7 సీట్లలో లభించే కియా కారెన్స్ ధరను 15న కంపెనీ అధికారికంగా వెల్లడించనుంది. స్ల్పిట్ ఎల్ఈడీ హెడ్ల్యాంప్స్, డీఆర్ఎల్స్, వంటి ఫీచర్లతో ప్రీమియం, ప్రెస్టీజ్, ప్రెస్టీజ్ ప్లస్, లగ్జరీ, లగ్జరీ ప్లస్ వంటి ఐదు ట్రిమ్స్లో కియా కారెన్స్ అందుబటులో ఉంటుంది.
ఆరు ఎయిర్బ్యాగ్లు, డౌన్హిల్ బ్రేక్ కంట్రోల్, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్లు, 10.25 ఇంచ్ ఇన్ఫోటెయిన్మెంట్ స్క్రీన్, ఫుల్లీ డిజిటల్ ఇనుస్ట్రుమెంట్ ప్యానెల్, సింగిల్ పేన్ సన్రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, ఎయిర్ ప్యూరిఫైర్, బాస్ స్పీకర్ సిస్టమ్ వంటి ఫీచర్లు కస్టమర్లను ఆకట్టుకుంటాయి. ఇక కియా కారెన్స్ రూ 12 లక్షల నుంచి రూ 18 లక్షల వరకూ అందుబాటులో ఉంటుంది.