న్యూఢిల్లీ, నవంబర్ 15: కరోనాతో ఢీలాపడిన దేశీయ ఎగుమతులు మళ్లీ ఊపందుకున్నాయి. గత నెలకుగాను ఎగుమతుల్లో 43 శాతం వృద్ధి నమోదైంది. 35.65 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. ఇదే నెలలో దిగుమతులు ఏడాది ప్రాతిపదికన 62.51 శాతం ఎగబాకి 55.37 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. దీంతో వాణిజ్యలోటు 19.73 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పెట్రోలియం, కాఫీ, ఇంజినీరింగ్ గూడ్స్, పత్తి, జెమ్స్ అండ్ జ్యువెల్లరీ, కెమికల్స్ ప్లాస్టిక్, సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో భారీగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-అక్టోబర్ మధ్యకాలంలో 222.54 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి కాగా, 331.39 బిలియన్ డాలర్ల ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి.