న్యూఢిల్లీ, నవంబర్ 28: దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ఆటోమొబైల్ తయారీ సంస్థలు వీటి కెపాసిటీని అమాంతం పెంచుకుంటున్నాయి. వచ్చే మూడేండ్లకాలంలో సామర్థ్యాన్ని పెంపొందించడానికి రూ.65 వేల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టవచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనావేస్తున్నది.